బురదలో కూరుకుపోయిన ప్రధాని మోదీ ఎస్కార్ట్ హెలికాప్టర్... జేసీబీతో బయటకు లాగిన వైనం!
- కర్ణాటకలో ఎన్నిల ప్రచార హోరు
- సుడిగాలి పర్యటనలు చేస్తున్న ప్రధాని మోదీ
- ఇవాళ రాయచూరు జిల్లా సింధనూరు రాక
- ఓ వరిపొలంలో హెలిప్యాడ్ ఏర్పాటు
- పొలం చిత్తడిగా ఉండడంతో ఇరుక్కుపోయిన హెలికాప్టర్
రాయచూర్ జిల్లా సింధనూరు వద్ద ఓ సభలో పాల్గొనేందుకు మోదీ వచ్చారు. హోసళ్లి క్యాంపు సమీపంలోని ఓ వరిపొలంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. కానీ ఆ పొలం ఇంకా చిత్తడిగానే ఉండడంతో, ల్యాండైన హెలికాప్టర్ మళ్లీ గాల్లోకి లేవలేకపోయింది.
దాంతో, ఓ జేసీబీ, 100 మంది మనుషుల సాయంతో హెలికాప్టర్ ను బురద నుంచి బయటికి తీసుకువచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది తప్పిదం వల్లే ప్రధాని మోదీ ఎస్కార్ట్ హెలికాప్టర్ కు ప్రమాదం ఎదురైందని భావిస్తున్నారు.