కేరళలో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
- కాసర్ గోడ్ నుంచి తిరువనంతపురంకు వెళ్తున్న రైలుపై దాడి
- ఒక కోచ్ అద్దాలు ధ్వంసం
- గత నెల 25న రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
కాసర్ గోడ్ నుంచి తిరువనంతపురంకు రైలు వెళ్తుండగా తిరునవాయ - తిరూర్ మధ్య రైలుపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎవరూ గాయపడనప్పటికీ... ఒక కోచ్ కు చెందిన అద్దాలు డ్యామేజ్ అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి అనంతరం సదరన్ రైల్వే అధికారులు స్పందిస్తూ... రైలుకు మరింత భద్రతను కల్పిస్తామని చెప్పారు.
గత నెల 25న ఈ వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్ లో జెండాను ఊపి రైలును ప్రారంభించారు.