లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits
  • 75 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 26 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2.38 శాతం పెరిగిన బజాజ్ ఫైనాన్స్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. పవర్, ఫైనాన్స్ షేర్ల కొనుగోళ్ల అండతో మార్కెట్లు లాభపడ్డాయి ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 75 పాయింట్లు లాభపడి 60,131కి చేరుకుంది. నిఫ్టీ 26 పాయింట్లు పెరిగి 17,769 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (2.38%), జజాజ్ ఫిన్ సర్వ్ (2.11%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.76%), భారతి ఎయిర్ టెల్ (1.60%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.28%). 

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.47%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.15%), టెక్ మహీంద్రా (-0.90%), సన్ ఫార్మా (-0.67%), యాక్సిస్ బ్యాంక్ (-0.51%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News