అదానీకి, కర్ణాటక సర్కారుకు నిబంధనలు వర్తించవా?: కేటీఆర్
- అవినీతిపై ప్రసంగాలు, నిబంధనలకు అవి అతీతమంటూ ఎద్దేవా
- కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై మంత్రి కేటీఆర్ విమర్శ
- ఈడీ, సీబీఐల తీరును జనం గమనిస్తున్నారని వ్యాఖ్య
బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసి, చాలా విషయాలు బయటపెట్టినందుకు జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను అరెస్టు చేస్తారని భావిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. అవినీతి గురించి, దాని నిర్మూలన గురించి చెప్పే ప్రధాని మోదీ.. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం వసూలు చేస్తున్న కమీషన్ల గురించి మాట్లాడడం లేదేమని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీ విషయంలో నిబంధనలు వర్తించవా అని నిలదీశారు.