పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులే గెలవడంపై చంద్రబాబు స్పందన
- ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్
- మూడింటికి మూడు స్థానాల్లో సైకిల్ జోరు
- ప్రజలకు కృతజ్ఞతలు చెప్పిన చంద్రబాబు
- ప్రజలకు అండగా నిలవాలని ముగ్గురు విజేతలకు పిలుపు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి శాసనమండలికి వెళుతున్న వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రజాసమస్యలపై పోరాడాలని కోరుతున్నానని చంద్రబాబు తెలిపారు. మీకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అండగా ఉంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.