దేశానికి వ్యతిరేకంగా నేనేం మాట్లాడలేదు: రాహుల్ గాంధీ
- ఈ రోజు పార్లమెంటు సమావేశాలకు హాజరైన రాహుల్
- భారత ప్రజాస్వామ్యంపై విదేశాల్లో చేసిన వ్యాఖ్యలపై దుమారం
- తనకు అవకాశం ఇస్తే దీనిపై పార్లమెంటులో మాట్లాడతానన్న కాంగ్రెస్ నేత
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈరోజు పార్లమెంటుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. భారతదేశానికి వ్యతిరేకంగా తానేమీ మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఒకవేళ అనుమతిస్తే పార్లమెంటులో మాట్లాడతానని చెప్పారు. అక్కడ అవకాశం ఇవ్వకపోతే పార్లమెంటు బయట మాట్లాడతానని తెలిపారు. కాగా, ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.