Sensex: వరుసగా ఐదో రోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

markets ends in losses
  • 344 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 71 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2 శాతం పతనమైన భారతి ఎయిర్ టెల్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయ సానుకూలతలతో ఈ ఉదయం మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అయితే ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గుచూపడంతో లాభాలు కరిగిపోయి భారీగా నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 344 పాయింట్లు నష్టపోయి 57,555కి పడిపోయింది. నిఫ్టీ 71 పాయింట్లు కోల్పోయి 16,972కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (3.03%), టాటా స్టీల్ (2.07%), టైటాన్ (1.76%), ఎల్ అండ్ టీ (1.47%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.44%). 

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-2.00%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.85%), రిలయన్స్ (-1.74%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.56%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.54%).
Sensex
Nifty
Stock Market

More Telugu News