Telangana: తెలంగాణలో ఒంటిపూట బడులు.. ఎప్పటి నుంచంటే!

Telangana Schools To Operate Half Day Classes From March 15
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఒంటిపూట బడులు నిర్వహించాలని తెలంగాణ సర్కారు ఆదేశాలు జారీచేసింది. వేసవి ఎండల కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 లోపు క్లాసులు నిర్వహించాలని సూచించింది. మార్చి 15 నుంచి ఈ టైమింగ్స్ ఫాలో కావాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలతో పాటు ప్రైవేటు స్కూళ్లు కూడా ఒంటిపూట బడులు నిర్వహించాలని పేర్కొంది.

మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు క్లాసులు మధ్యాహ్నం వరకే నిర్వహించాలని, ఆ తర్వాత ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో వెల్లడించింది. పదో తరగతి విద్యార్థులకు మాత్రం ప్రత్యేక తరగతులు కొనసాగించాలని విద్యాశాఖ సూచించింది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ క్లాసులు నిర్వహించాలని తెలిపింది. ఈమేరకు ప్రాంతీయ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్.. జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను అన్ని స్కూల్స్ పాటిస్తున్నాయా లేదా అనేది క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
Go Back to Shorts
Telangana
Schools
summer
half day
classes
pvt schools

More Telugu News