Team India: మహిళల టీ20 వరల్డ్ కప్: భారత్ కు 152 పరుగుల టార్గెట్ నిర్దేశించిన ఇంగ్లండ్ 

దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో నేడు భారత్, ఇంగ్లండ్ తలపడుతున్నాయి. ఈ గ్రూప్-బి లీగ్ మ్యాచ్ లో టాస్ నెగ్గిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ అమ్మాయిలు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేశారు. నాట్ షివర్ బ్రంట్ 50 పరుగులు చేయగా, వికెట్ కీపర్ అమీ జోన్స్ 40 పరుగులతో రాణించింది. కెప్టెన్ హీదర్ నైట్ 28 పరుగులు చేసింది. 

భారత అమ్మాయిల్లో రేణుకా ఠాకూర్ సింగ్ 4 ఓవర్లు విసిరి 15 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం విశేషం. శిఖా పాండే 1, దీప్తి శర్మ 1 వికెట్ తీశారు. రేణుకా ఠాకూర్ సింగ్ ధాటికి ఇంగ్లండ్ జట్టు ఓ దశలో 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ 3 వికెట్లు రేణుక ఖాతాలో చేరాయి. అయితే, కెప్టెన్ హీదర్ నైట్, నాట్ షివర్ జోడీ ఇంగ్లండ్ ను ఆదుకుంది. చివర్లో అమీ జోన్స్ ధాటిగా ఆడడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
Team India
England
Women
T20 World Cup

More Telugu News