సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా
- వాస్తవానికి రేపు కొండగట్టులో కేసీఆర్ పర్యటన
- మంగళవారం రోజున కొండగట్టులో భక్తుల రద్దీ
- భక్తులకు అసౌకర్యం కలగకూడదని సీఎం పర్యటన వాయిదా
- కొండగట్టులో ఎల్లుండి పర్యటించాలని తాజా నిర్ణయం
ఆలయ పునర్ నిర్మాణం కోసం క్షేత్రస్థాయిలో ఆలయాన్ని పరిశీలించనున్నారు. అయితే, భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే మంగళవారం రోజున ఆలయ పర్యటన ఇబ్బందికరంగా ఉంటుందని సీఎంవో భావించింది. సీఎం రాకతో భక్తులకు అసౌకర్యం కలగకూడదనే ఈ పర్యటన వాయిదా నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ సర్కారు ఇటీవలి బడ్జెట్ లో కొండగట్టు క్షేత్రం అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయించడం తెలిసిందే. యాదాద్రి తరహాలోనే ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా తీర్చిదిద్దనున్నారు.