Ghantasala: ఘంటసాల చివరి కోరికను నెరవేర్చబోయి ఆమె ప్రాణాలు విడిచిందట!

  • ఘంటసాల రెండవ భార్య సరళ 
  • ఆ దంపతుల సంతానమే రవికుమార్ 
  • ఘంటసాల తీరని కోరిక గురించిన ప్రస్తావన 
  • కైలాసగిరి దర్శనం చేసుకుని తన తల్లి కన్ను మూసిందని వెల్లడి 

Ghantasala Ravi Kumar Interview

ఘంటసాలకి ఇద్దరు భార్యలు అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఒకరు సావిత్రమ్మ అయితే, మరొకరు సరళ. ఘంటసాల - సరళ వివాహాన్ని సావిత్రమ్మ దగ్గరుండి జరిపించడం విశేషం. ఘంటసాల వలన సరళకి కలిగిన సంతానమే రవి కుమార్. ఘంటసాల పోలికలు ఎక్కువగా కనిపించేది ఆయనలోనే. 

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " కైలాసగిరి దర్శనం .. మానస సరోవర యాత్ర చేయాలనేది మా నాన్నగారి కోరిక. అయితే ఆ కోరిక తీరకుండానే ఆయన వెళ్లిపోయారు. అందువలన ఆయన కోరికను నెరవేర్చడం కోసం మా అమ్మగారు ఒక బృందంతో కలిసి మానస సరోవర యాత్రకి వెళ్లారు. 

" ఆమె కైలాసగిరి దర్శనం చేసుకున్నారు .. మానస సరోవరం చూశారు. ఆ తరువాత తన కోరిక నెరవేరిందని చెప్పేసి అక్కడి నుంచి మాకు కాల్ చేసి చెప్పారు. ఆ సమయంలో ఆమె చాలా ఆనందంగా మాట్లాడారు. ఆ తరువాత అక్కడే వున్న టెంట్ లో ఆమె ప్రాణాలు వదిలారు. అలా అమ్మగారు శివ సాయుజ్యాన్ని పొందారు" అన్ని చెప్పుకొచ్చారు. 

More Telugu News