Team India: టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్

An unwanted record for Arshdeep Singh
షార్ట్స్‌లో చూడండి
న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ టీ20 సిరీస్ ను మాత్రం పేలవంగా ఆరంభించింది. రాంచీలో శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20లో 21 పరుగుల తేడాతో చిత్తయింది. ఈ మ్యాచ్ లో భారత ఓటమికి యువ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ కారణమని విమర్శకులు, నెటిజన్లు అతనిపై దుమ్మెత్తిపోస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. 

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో చివరి ఓవర్ వేసిన అర్ష్ దీప్ ఏకంగా 27 పరుగులు ఇవ్వడమే అందుకు కారణమైంది. అంతేకాదు తను ఓ చెత్త రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఆఖరి ఓవర్ తొలి బంతికి అతను నో బాల్ వేశాడు. దాంతో, అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక నో బాల్స్ వేసిన బౌలర్ గా నిలిచాడు. ఇప్పటిదాకా 22 మ్యాచ్ ల్లో అతను 14 నో బాల్స్ వేశాడు. పాకిస్థాన్ కు చెందిన హసన్ అలీ 11 నో బాల్స్ తో రెండో స్థానంలో ఉన్నాడు.
Go Back to Shorts
Team India
Team New Zealand
Arshdeep Singh
record
bo balls

More Telugu News