Team India: న్యూజిలాండ్ తో తొలి టీ20... టాస్ గెలిచిన టీమిండియా

ఇటీవల న్యూజిలాండ్ పై మూడు వన్డేల సిరీస్ గెలిచి మాంచి ఊపుమీదున్న టీమిండియా, తాజాగా టీ20 సిరీస్ కు సిద్ధమైంది. నేడు రాంచీలో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ 18, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 5 పరుగులతో ఉన్నారు. టీ20 సిరీస్ లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ కు మిచెల్ శాంట్నర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
Team India
Toss
New Zealand
1st T20
Ranchi

More Telugu News