పరిటాల వర్ధంతి కార్యక్రమంలో నందమూరి తారకరత్న
- అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఘన స్వాగతం పలికిన నేతలు
- రవీంద్ర ఘాట్ వద్ద నివాళులర్పించిన తారకరత్న
- పరిటాల శ్రీరామ్ తదితరులతో కొద్దిసేపు చర్చ
పరిటాల వర్ధంతి కార్యక్రమానికి నందమూరి తారకరత్న కూడా హాజరయ్యారు. అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఆయనకు నాయకులు ఘన స్వాగతం పలికారు. తర్వాత రవీంద్ర ఘాట్ దగ్గర తారకరత్న నివాళులు అర్పించారు. పరిటాల శ్రీరామ్, సిద్ధార్థ్, ఇతర కుటుంబ సభ్యులతో తదితరులతో ఈ సందర్భంగా తారకరత్న మాట్లాడారు. తారకరత్నను చూసేందుకు వచ్చిన అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగారు.