Sensex: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits
  • కొత్త సంవత్సరంలో వరుసగా రెండో రోజు లాభాలు
  • 126 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 35 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
కొత్త సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో కూడా లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 126 పాయింట్లు లాభపడి 61,294కి పెరిగింది. నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 18,232కి చేరుకుంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (2.18%), టైటాన్ (2.02%), టీసీఎస్ (1.63%), టెక్ మహీంద్రా (1.38%), సన్ ఫార్మా (1.34%). 

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-0.83%), రిలయన్స్ (-0.71%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.64%), ఐటీసీ (-0.53%), ఏసియన్ పెయింట్స్ (-0.50%).
Sensex
Nifty
Stock Market

More Telugu News