gachibouli: హైదరాబాద్ లో టిప్పర్ బీభత్సం.. ఒకరి మృతి

  • గచ్చిబౌలి సిగ్నల్ దగ్గర వాహనాలపైకి దూసుకెళ్లిన టిప్పర్
  • బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం
  • ఫుడ్ డెలివరీ బాయ్ దుర్మరణం.. మరో ఐదుగురికి గాయాలు
One person was killed when a tipper lorry overturned in Hyderabad

హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో సోమవారం ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. విప్రో చౌరస్తాలో టిప్పర్ అదుపుతప్పింది. సిగ్నల్ దగ్గర ఆగిన నాలుగు కార్లు, రెండు బైక్ ల పైకి దూసుకెళ్లింది. దీంతో వాహనాలన్నీ నుజ్జునుజ్జయ్యాయి. స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న నసీర్ అనే యువకుడు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో అబ్దుల్ అనే విద్యార్థికి కాలు విరిగిందని వైద్యులు తెలిపారు. 

ప్రమాదం విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. బ్రేకులు ఫెయిల్ కావడంతో టిప్పర్ అదుపుతప్పినట్లు పోలీసులు చెబుతున్నారు.  

More Telugu News