Team India: టీమిండియా-బంగ్లాదేశ్ టెస్టు... ముగిసిన నాలుగో రోజు ఆట

చట్టోగ్రామ్ లో టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట చివరికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 272 పరుగులు చేసింది. కెప్టెన్ షకీబల్ హసన్ 40, మెహిదీ హసన్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ గెలవాలంటే ఇంకా 241 పరుగులు చేయాలి. మరో 4 వికెట్లు తీస్తే టీమిండియా గెలుస్తుంది. 

ఈ టెస్టులో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 404 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ 150 పరుగుల స్కోరుకే ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ను 258/2 స్కోరు వద్ద టీమిండియా డిక్లేర్ చేసింది. తద్వారా బంగ్లాదేశ్ ముందు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
Team India
Bangladesh
1st Test
Chattogram

More Telugu News