Sensex: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits
  • 249 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 74 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2 శాతానికి పైగా లాభపడ్డ పవర్ గ్రిడ్ కార్పొరేషన్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు స్వస్తి పలకడంతో పాటు, విదేశీ మదుపర్లు పెట్టుబడులు పెట్టడం మార్కెట్లకు కలిసొచ్చాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 249 పాయింట్లు లాభపడి 61,872కి చేరుకుంది. నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 18,403 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.20%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.92%), భారతి ఎయిర్ టెల్ (1.64%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.56%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.41%). 

టాప్ లూజర్స్:
ఐటీసీ (-0.60%), రిలయన్స్ (-0.43%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.37%), సన్ ఫార్మా (-0.33%), నెస్లే ఇండియా (-0.16%).
Sensex
Nifty
Stock Market

More Telugu News