తెలుగు క్రికెటర్లను వదిలేస్తున్న ఐపీఎల్ ఫ్రాంచైజీ
- కేఎస్ భరత్, అశ్విన్ హెబ్బర్ లను వేలంలోకి పంపాలని నిర్ణయం
- స్టార్ పేసర్ శార్దూల్ ఠాకూర్, మరో ఇద్దరిని రిలీజ్ చేయనున్న ఢిల్లీ ఫ్రాంచైజీ
- ఐపీఎల్ ప్లేయర్ల రిటైన్షన్ కు ఈ నెల 15 వరకు తుది గడువు
గత ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 10.75 కోట్ల ధరతో పేసర్ శార్దూల్ను తీసుకుంది. అలాగే, బెంగళూరు నుంచి కేఎస్ భరత్ ను తీసుకుంది. జట్టులో రెగ్యులర్ కీపర్ గా కెప్టెన్ రిషబ్ పంత్ వికెట్ కీపర్గా ఉండటంతో భరత్కు మ్యాచ్లు ఆడే అవకాశం రావడం లేదు. దీంతో అతడిని కూడా వేలంలోకి పంపాలని నిర్ణయించింది. ఏపీకే చెందిన అశ్విన్ హెబ్బర్కు గత సీజన్ లో మ్యాచ్ ఆడే చాన్సే రాలేదు. పంజాబ్ కు చెందిన ఓపెనర్ మన్దీప్ ఫామ్లో లేడు. దాంతో, వీళ్లను వదులుకోవాలని ఢిల్లీ నిర్ణయానికి వచ్చింది.