TRS: పదో రౌండ్ లో 'కారు'కు స్వల్ప ఆధిక్యం

  • కొనసాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్
  • పదో రౌండ్ లో టీఆర్ఎస్ కు 484 ఓట్ల ఆధిక్యం
  • 4,407 ఓట్లకు పెరిగిన లీడ్
  • ముందంజలో టీఆర్ఎస్ పార్టీ
TRS gets slight lead in tenth round

మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. పదో రౌండ్ లో టీఆర్ఎస్ కు 484 ఓట్ల స్వల్ప ఆధిక్యం లభించింది. ఈ రౌండ్ లో టీఆర్ఎస్ కు 7,499 ఓట్లు లభించగా, బీజేపీకి 7,015 ఓట్లు వచ్చాయి. 

మొత్తం 10 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ పార్టీ లీడ్ 4,407 ఓట్లకు చేరింది. ఇప్పటివరకు టీఆర్ఎస్ కు మొత్తం 67,330 ఓట్లు, బీజేపీకి 62,923 ఓట్లు, కాంగ్రెస్ కు 14,596 ఓట్లు లభించాయి. మరో ఐదు రౌండ్ల కౌంటింగ్ మిగిలున్న నేపథ్యంలో మరికాసేట్లో మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది.

More Telugu News