కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో భారత్ జోడో యాత్రకు వచ్చిన ఖర్గే... ఆత్మీయ స్వాగతం పలికిన రాహుల్
- హైదరాబాద్ చేరిన రాహుల్ గాంధీ యాత్ర
- నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన సభకు హాజరైన ఖర్గే
- కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిని గుండెలకు హత్తుకున్న రాహుల్ గాంధీ
ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా ఖర్గేకు రాహుల్ గాంధీ ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఖర్గేను తన గుండెలకు హత్తుకున్న రాహుల్ గాంధీ... పార్టీని విజయ తీరాలకు చేర్చాల్సింది మీరేనంటూ చెప్పారు. రాహుల్ ఆత్మీయ స్వాగతానికి ఖర్గే ఆనందంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ రాహుల్ గాంధీ యాత్ర దేశ రాజకీయాలను మార్చేస్తుందని ప్రకటించారు.