Team India: దక్షిణాఫ్రికాపై టాస్ నెగ్గిన భారత్... హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన రోహిత్ సేన

  • పెర్త్ లో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నరోహిత్ శర్మ
  • జట్టులోకి వచ్చిన దీపక్ హుడా
  • మరో విజయం కోసం ఉరకలేస్తున్న టీమిండియా
Team India eyes on third win

టీ20 వరల్డ్ కప్ లో నేడు టీమిండియా, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. పెర్త్ లో జరిగే ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీ సూపర్-12 దశలో ఇప్పటికే రెండు మ్యాచ్ లు నెగ్గి మాంచి ఊపుమీదున్న రోహిత్ సేన... నేటి మ్యాచ్ లోనూ గెలిస్తే సెమీస్ బెర్తు దాదాపు ఖాయమవుతుంది. 

తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ ను మట్టికరిపించిన భారత్, రెండో మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను ఓడించి రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుని గ్రూప్-2 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 

ఇక, నేడు బలమైన దక్షిణాఫ్రికాతో ఆడుతున్న భారత్... తుదిజట్టులో ఒక్క మార్పు చేసింది. అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడాకు స్థానం కల్పించింది. అటు దక్షిణాఫ్రికా జట్టులోనూ ఒక మార్పు చేశారు. స్పిన్నర్ షంసీ స్థానంలో ఎంగిడీని తుది జట్టులోకి తీసుకున్నారు. 

కాగా, మళ్లీ ఫామ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో వరుసగా రెండు అర్ధసెంచరీలు నమోదు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, నేటి మ్యాచ్ లోనూ కోహ్లీ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు.


టీమిండియా...
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్.

దక్షిణాఫ్రికా...
టెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, రిలీ రూసో, అయిడెన్ మార్ క్రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టాన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడా, లుంగి ఎంగిడి, ఆన్రిచ్ నోర్జే.

More Telugu News