కాలం చెల్లిన 1500 చట్టాలను రద్దు చేస్తాం: కిరణ్ రిజిజు
- ఇప్పుడున్న పరిస్థితులకు వాటి అవసరంలేదు
- వాటితో ఆటంకమే తప్ప జనాలకు ఉపయోగంలేదు
- పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉపసంహరించుకుంటామని వెల్లడించిన న్యాయ శాఖ మంత్రి
‘సాధారణ ప్రజాజీవనంపై కొన్ని చట్టాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు ప్రశాంతంగా జీవించేలా చూడడమే వాటి ఉద్దేశం. కానీ కాలం చెల్లిన చట్టాలు ప్రజలకు భారంగా మారుతున్నాయి. ప్రజలకు ఏమాత్రం ఉపయోగంలేని సుమారు 1500 పురాతన కాలం నాటి చట్టాలను తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి మేం నిర్ణయించాం. ప్రస్తుత కాలంలో ఆ చట్టాలతో ఏమాత్రం ఉపయోగంలేదు’అని కేంద్ర మంత్రి రిజిజు అన్నారు.