రేపే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు... ఏపీ, కర్ణాటక సరిహద్దులో ఓటేయనున్న రాహుల్ గాంధీ

rahul gandhi cast his vote in party presidential elections at suginekal camp
  • రేపు ఉదయం 11 గంటలకు పోలింగ్ ప్రారంభం
  • సుగినేకళ్ క్యాంపులో ఓటేయనున్న రాహుల్ గాంధీ
  • యాత్రలో పాల్గొంటున్న ఏపీ నేతల కోసం కర్నూలులో ఏర్పాట్లు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ రేపు (సోమవారం) జరగనుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగిన నేతలంతా ఆయా రాష్ట్రాల్లోనే ఓటు హక్కు వినియోగించుకునేలా పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్టీ అధ్యక్ష పదవికి పార్టీ  సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ లు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. రేపు ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. 

ఇదిలా ఉంటే... కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల వేళ ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర ఇటీవలే ఏపీలోకి ప్రవేశించింది. కర్ణాటక సరిహద్దులోని ఏపీలో ఈ యాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఏపీ, కర్ణాటక సరిహద్దు గ్రామం సుగినేకళ్ లో ఏర్పాటు చేసిన క్యాంపులో ఓటు హక్కు వినియోగించనున్నారు. రాహుల్ తో యాత్రలో సాగుతున్న ఇతర రాష్ట్రాల నేతలు కూడా ఇక్కడే ఓటు వేయనున్నారు. ఇక యాత్రలో పాలుపంచుకుంటున్న ఏపీ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కర్నూలులో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
Go Back to Shorts
Congress
Bharat Jodo Yatra
Rahul Gandhi
Congress Presidential Elections
Andhra Pradesh
Karnataka
Suginekal

More Telugu News