నేడు బీజేపీలో చేరనున్న పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్
- జేపీ నడ్డా సమక్షంలో నేడు బీజేపీలో చేరనున్న అమరీందర్ సింగ్
- గతేడాది పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
- ఆ తర్వాత కాంగ్రెస్ను వీడి పంజాబ్ లోక్ కాంగ్రెస్ స్థాపన
- గత ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి చేతిలో ఓడిన కెప్టెన్
ఈ నేపథ్యంలో ఆయన తన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా నేడు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నారు. అమరీందర్ సింగ్తోపాటు ఆయన పార్టీ పీఎల్సీలో చేరిన ఏడుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కూడా నేడు కాషాయ కండువా కప్పుకోబోతున్నారు.