తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ... పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం
- తెలంగాణ విమోచనా దినోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ షా
- ఈటల ఇంటికి వెళ్లిన కేంద్ర హోం శాఖ మంత్రి
- అమిత్ షాతో భేటీకి హాజరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్ది
ఆ తర్వాత తెలంగాణ శాఖకు చెందిన బీజేపీ కీలక నేతలతో అమిత్ షా ఓ కీలక భేటీని నిర్వహించారు. ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఈటల రాజేందర్, పార్టీ ముఖ్యులు వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, ఇటీవలే పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సంబంధించి రాష్ట్ర శాఖ నేతలకు అమిత్ షా కీలక సలహాలు, సూచనలు అందించినట్లు సమాచారం.