గాలి జనార్దన్ రెడ్డి కేసు విచారణ జాప్యంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు
- గాలి జనార్దన్ రెడ్డి కేసు విచారణపై సుప్రీంకోర్టులో విచారణ
- 12 ఏళ్లుగా ఈ కేసు విచారణలో ట్రయల్ జరగకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం
- ఈ జాప్యం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్య
- కేసు విచారణ జాప్యానికి గల కారణాలను సీల్డ్ కవర్లో అందించాలని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఆదేశం
గాలి జనార్దన్ రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన గనుల అక్రమ తవ్వకాల కేసు ప్రస్తుతం హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసు విచారణపై దాఖలైన పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగానే విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఈ కేసు విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కేసు విచారణలో జాప్యానికి గల కారణాలను సీల్డ్ కవర్లో అందించాలని ఆదేశించింది.