ఇంటికి చేరుకున్న కృష్ణంరాజు పార్థివదేహం.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం

Krishnam Raju Dead Body Reached to home
  • ఈ తెల్లవారుజామున కన్నుమూసిన కృష్ణంరాజు
  • అభిమానుల సందర్శనార్థం రేపటి వరకు ఇంటి వద్దే పార్థివదేహం
  • ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్‌కు కేసీఆర్ ఆదేశాలు
అనారోగ్యంతో బాధపడుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూసిన ప్రముఖ నటుడు కృష్ణంరాజు పార్థివదేహాన్ని ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడాయనకు నివాళులు అర్పిస్తారు. అభిమానుల సందర్శనార్థం రేపు మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచుతారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహిస్తారు. 

ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణంరాజు కేంద్ర మాజీ మంత్రి మాత్రమే కాదని, తనకు అత్యంత ఆప్తుడని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలన్న ఆదేశాలతో సీఎస్ సోమేశ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా, కృష్ణంరాజు మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Go Back to Shorts
Krishnam Raju
Tollywood
KCR
Last Rites

More Telugu News