నాటకీయ పరిణామాల మధ్య.. సీపీఐ తెలంగాణ కార్యదర్శిగా కూనంనేని ఎన్నిక
- కూనంనేని సాంబశివరావుతో పోటీ పడ్డ పల్లా వెంకట్ రెడ్డి
- కూనంనేనికి 59, పల్లాకు 45 ఓట్లు
- గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యేగా పని చేసిన కూనంనేని
మరోవైపు, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా చాడ వెంకట్ రెడ్డి రెండు సార్లు ఎన్నికయ్యారు. ఇప్పుడు మూడో సారి కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, తన ఎన్నిక ఏకగ్రీవం కావాలని ఆయన పార్టీ శ్రేణులకు చెప్పారు. అయితే, ఈసారి అవకాశం తనకు ఇవ్వాలని కూనంనేని పట్టుబట్టడంతో... చాడ వెంకటరెడ్డి తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ క్రమంలో పల్లా వెంకటరెడ్డి తెరపైకి వచ్చారు. చివరకు కూనంనేని రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు.