కారు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ దుర్మరణంపై మెర్సిడెస్ బెంజ్ స్పందన ఇదే!
- విచారణ అధికారులకు సహకరిస్తున్నామన్న మెర్సిడెస్ బెంజ్
- రోడ్ సేఫ్టీపై తమ వినియోగదారుల్లో అవగాహన పెంచుతామని వ్యాఖ్య
- మిస్త్రీ, పండోలే మృతి చెందడం బాధాకరమన్న బెంజ్
వినియోగదారుల గోప్యతను తాము గౌరవిస్తామని మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. అయితే విచారణ అధికారులకు అవసరమైన సమాచారాన్ని నేరుగా వారికే అందిస్తామని చెప్పింది. తమ వాహనాలకు సరికొత్త భద్రతా ఫీచర్లను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూనే ఉన్నామని తెలిపింది. రోడ్ సేఫ్టీపై తమ వినియోగదారుల్లో అవగాహనను పెంచే ప్రయత్నాలను కొనసాగిస్తామని చెప్పింది. రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ, జహంగీర్ పండోలే మృతి చెందడం బాధాకరమని తెలిపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిగిలిన ఇద్దరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పింది.