ఏపీవ్యాప్తంగా బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశాలు... ఇంచార్జీలను ప్రకటించిన సోము వీర్రాజు
- సమావేశాల రాష్ట్ర ఇంచార్జీగా విష్ణువర్ధన్ రెడ్డి
- నాలుగు ప్రాంతాలకు నలుగురు ఇంచార్జీలు
- ఉత్తర్వులు జారీ చేసిన సోము వీర్రాజు
ఈ సమావేశాల నిర్వహణ కోసం పార్టీ యువ నేత విష్ణువర్ధన్ రెడ్డిని రాష్ట్ర ఇంచార్జీగా నియమిస్తున్నట్లు వీర్రాజు ప్రకటించారు. అదే సమయంలో రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభజించి, నాలుగు ప్రాంతాల్లో నిర్వహించే సమావేశాలకు నలుగురు ఇంచార్జీలను నియమించారు. ఉత్తరాంధ్రకు పరశురామ్ రాజు, కోస్తాంధ్రకు కోలా ఆనంద్, గోదావరి జిల్లాలకు తపన చౌదరి, రాయలసీమకు పనతల సురేశ్ను నియమిస్తూ వీర్రాజు ఉత్తర్వులు జారీ చేశారు.