భారత్తో టీ20 సిరీస్కు జట్టును ప్రకటించిన ఆసీస్.. వార్నర్కు రెస్ట్
- టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో వార్నర్కు విశ్రాంతి
- అతడి స్థానంలో కేమరన్ గ్రీన్కు చోటు
- ఈ నెల 20న మొహాలీలో తొలి మ్యాచ్
ఇటీవల జింబాబ్వేతో జరిగిన రెండు వన్డేల్లో వార్నర్ వరుసగా 57, 13 పరుగులు మాత్రమే చేశాడు. బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)కు తొమ్మిదేళ్లపాటు దూరంగా ఉన్న వార్నర్ ఇటీవల సిడ్నీ థండర్తో రెండేళ్ల కాంట్రాక్ట్పై సంతకం చేశాడు. జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగే సిడ్నీ టెస్ట్ తర్వాత వార్నర్ సిడ్నీ థండర్లో చేరుతాడు. ఐదు మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
భారత్తో తలపడనున్న ఆసీస్ జట్టు ఇదే:
ఆస్టన్ అగర్, పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), టిమ్ డేవిడ్, అరోన్ ఫించ్ (కెప్టెన్), జోష్ హేజిల్వుడ్, జోష్ ఇంగ్లిష్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినెస్, మాథ్యూవేడ్, కేమరన్ గ్రీన్, ఆడం జంపా.