ఆసియా కప్: రాణించిన టీమిండియా బౌలర్లు... పాక్ 147 ఆలౌట్
- దుబాయ్ వేదికగా మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
- పరుగుల కోసం కష్టపడిన పాక్
- నాలుగు వికెట్లు తీసిన భువనేశ్వర్
- 3 వికెట్లతో రాణించిన హార్దిక్ పాండ్యా
పాక్ జట్టులో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇఫ్తికార్ అహ్మద్ 28 పరుగులు సాధించాడు. కెప్టెన్ బాబర్ అజామ్ (10), ఫకార్ జమాన్ (10), కుష్దిల్ షా (2) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. చివర్లో దహాని (6 బంతుల్లో 16), హరీస్ రవూఫ్ (7 బంతుల్లో 13 నాటౌట్) ధాటిగా ఆడడంతో పాకిస్థాన్ కాస్త గౌరవప్రదమైన స్కోరు సాధించింది.