'పార్లే' క‌ళ్ల‌ద్దాల‌తో జ‌గ‌న్ చిరున‌వ్వులు... ఫొటోలు ఇవిగో

ap cm ys jagan wear parle spectacles in vizag tour
  • విశాఖ‌లో ‘పార్లే ఫర్‌ ది ఓషన్‌’ను ప్రారంభించిన జ‌గ‌న్‌
  • తీరం శుద్ధి సంద‌ర్భంగా వినియోగించే క‌ళ్ల‌ద్దాల‌ను ధ‌రించిన జ‌గ‌న్‌
  • ప్ర‌త్యేక క‌ళ్ల‌ద్దాల‌తో ఫొటోల‌కు పోజిచ్చిన ఏపీ సీఎం
విశాఖ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శుక్ర‌వారం ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక క‌ళ్ల‌ద్దాల‌తో జిగేల్ మ‌న్నారు. స‌ముద్ర తీర ప్రాంతాన్ని శుద్ధి చేసేందుకు ఉద్దేశించిన ‘పార్లే ఫర్‌ ది ఓషన్‌’ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన సంద‌ర్భంగా  పార్లే సంస్థ రూపొందించిన ప్ర‌త్యేక క‌ళ్ల‌ద్దాల‌ను జ‌గ‌న్ ధ‌రించారు. పార్లే సంస్థ ప్ర‌తినిధులు, ఏపీ మంత్రులు, రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారుల‌తో క‌లిసి ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన జ‌గ‌న్‌... పార్లే సంస్థ‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం ఒప్పందం పూర్తయ్యాక‌... అక్క‌డ ఏర్పాటు చేసిన స్టాళ్ల‌ను ప‌రిశీలించారు. 

ఈ సంద‌ర్భంగా చెత్త‌ను ఏరే స‌మ‌యంలో క‌ళ్ల‌కు ధ‌రించే క‌ళ్ల‌ద్దాల‌ను పార్లే సంస్థ ప్ర‌తినిధులు అందించ‌గా... వాటిని జ‌గ‌న్ ఆసక్తిగా ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆ క‌ళ్ల‌ద్దాల‌ను జ‌గ‌న్ పెట్టుకోగా... వాటి ద్వారా క‌నిపించే దృశ్యాల‌ను జ‌గ‌న్ ఆస్వాదించారు. ఈ సంద‌ర్భంగా తీసిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా...అవి వైర‌ల్‌గా మారాయి.
Go Back to Shorts
YSRCP
YS Jagan
Parle
Vizag
Spectacles

More Telugu News