రఘురామకృష్ణరాజును తలకిందులుగా వేళ్లాడదీసి ఆ రూ.1000 కోట్లు కక్కించండి: సీబీఐని కోరిన విజయసాయి

  • ఇటీవల ఏపీ ఎన్నికల సర్వే ఫలితాలు వెల్లడించిన రఘురామ
  • రెబెల్ ఎంపీపై విజయసాయి ధ్వజం
  • పనీపాటా లేదంటూ విమర్శలు
  • మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడిందని వెల్లడి
రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఇటీవల రఘురామ ఎన్నికల సర్వే అంటూ కొన్ని ఫలితాలను వెల్లడించడం పట్ల విజయసాయి ఘాటుగా స్పందించారు. 

ప్రభుత్వ బ్యాంకుల్లో అమాయక డిపాజిటర్లను నిలువునా ముంచాక, ఇప్పుడు రఘురామ మాయలమారి రాజకీయ పండితుడి అవతారం ఎత్తాడని విమర్శించారు. పనీపాటా లేకపోవడంతో అతడి మానసిక ఆరోగ్యం గాడితప్పిందని, అందుకే ఢిల్లీలో కూర్చుని ఏపీ ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తున్నాడని ఎద్దేవా చేశారు. రఘురామను తలకిందులుగా వేళ్లాడదీసి ప్రభుత్వ బ్యాంకులకు అతడు బకాయిపడిన రూ.1000 కోట్లను కక్కించాలని సీబీఐని కోరుతున్నట్టు విజయసాయి ట్వీట్ చేశారు.

Vijayasai Reddy
Raghu Rama Krishna Raju
CBI
Dues
Public Banks
YSRCP

More Telugu News