ఓటమిని అంగీకరించి విజేతకు అభినందనలు తెలిపిన యశ్వంత్ సిన్హా
- కౌంటింగ్ పూర్తి కాకుండానే ఓటమి అంగీకరించిన సిన్హా
- ముర్ముకు అభినందనలు తెలుపుతూ ప్రకటన విడుదల
- రాష్ట్రపతిగా నిర్భయంగా వ్యవహరించాలని ముర్ముకు సూచన
అధికార పక్షానికి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉందని తెలిసి కూడా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన యశ్వంత్ సిన్హా ఓటు హక్కు కలిగిన ప్రజా ప్రతినిధులు తమ ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికల్లో ఓటమి ఖరారు కాగానే.. విజేత ద్రౌపది ముర్ముకు ఆయన అభినందనలు తెలిపారు. భారత రాష్ట్రపతిగా విధి నిర్వహణలో నిర్భయంగా, నిష్పాక్షికంగా నిర్ణయాలు తీసుకోవాలంటూ ఆయన ముర్ముకు సూచించారు.