చార్ ధామ్ యాత్రలో విషాదం... బస్సు లోయలో పడి 17 మంది మృతి

Bus falls into gorge as 17 people died
  • ఉత్తరాఖండ్ లో ఘటన
  • 28 మంది భక్తులతో వెళుతున్న బస్సు
  • భక్తులు మధ్యప్రదేశ్ కు చెందినవారు
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన అమిత్ షా
చార్ ధామ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ లో భక్తులతో వెళుతున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. దమ్తా ప్రాంతంలో యమునోత్రి జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా మధ్యప్రదేశ్ నుంచి బస్సులో వస్తుండగా ఈ ఘటన జరిగింది. 

ఈ ప్రమాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భక్తులతో వెళుతున్న బస్సు లోయలో పడిపోవడం విషాదకరం అని పేర్కొన్నారు. ఈ ఘటనపై తాను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ థామీతో మాట్లాడానని వెల్లడించారు. ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్ దళాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని వివరించారు.
Go Back to Shorts
Bus
Road Accident
Gorge
Uttarakhand
Char Dham

More Telugu News