డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం కుటుంబానికి చేరిన‌ టీడీపీ రూ.5 ల‌క్ష‌ల సాయం

tdp leaders hand over the cheque to driver subrahmanyam family
  •  హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం 
  • బాధిత కుటుంబానికి రూ.5 ల‌క్ష‌ల సాయం ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు
  • చెక్కును సుబ్ర‌హ్మ‌ణ్యం కుటుంబానికి అందించిన పార్టీ నేత‌లు
వైసీపీ ఎమ్మెల్సీ అనంత‌బాబు చేతిలో హ‌త్య‌కు గురైన డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం కుటుంబ స‌భ్యుల‌కు టీడీపీ ప్ర‌క‌టించిన రూ.5 ల‌క్ష‌ల సాయం ఆ కుటుంబ స‌భ్యుల‌కు చేరింది. ఈ మేర‌కు పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఆదేశాల మేర‌కు రూ.5 ల‌క్ష‌ల చెక్కును టీడీపీ నేత‌లు సుబ్ర‌హ్మ‌ణ్యం కుటుంబానికి శ‌నివారం అంద‌జేశారు. సుబ్ర‌హ్మ‌ణ్యం త‌ల్లిదండ్రులు, భార్యకు చెక్కును అంద‌జేసిన‌ట్లు టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎమ్మెస్ రాజు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని దారుణంగా హ‌త్య చేసిన అనంత‌బాబును పార్టీ నుంచే కాకుండా ఎమ్మెల్సీ ప‌ద‌వి నుంచి కూడా స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. అనంత బాబు కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వారైనా, ఆయ‌న‌ను కొండ కాపు కింద చూపెట్టి ఆయ‌న‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వ‌ర్తించ‌కుండా వైసీపీ ప్ర‌భుత్వం య‌త్నిస్తోంద‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. ఈ త‌రహా కుట్ర‌ల‌ను టీడీపీ అడ్డుకుంటుంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.
Go Back to Shorts
TDP
Chandrababu
MLC Anantha Babu
YSRCP

More Telugu News