సీఎం జగన్తో రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన వైసీపీ ఎంపీల భేటీ
- 4 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకున్న వైసీపీ
- ఈసీ నుంచి ప్రకటన రాగానే జగన్తో భేటీ అయిన కొత్త ఎంపీలు
- బీసీల హృదయాల్లో జగన్ది చెరగని ముద్ర అన్న మస్తాన్ రావు
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తమను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు వారు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. బీసీల హృదయాల్లో సీఎం జగన్ది చెరగని ముద్ర అని బీద మస్తాన్ రావు అన్నారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తానని ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే... రాష్ట్రం నుంచి కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన నేతలకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అభినందనలు తెలిపారు.