Sensex: మార్కెట్లకు ఈరోజు కూడా నష్టాలే

Markets ends in losses
  • 276 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 72 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2 శాతానికి పైగా నష్టపోయిన ఎల్ అండ్ టీ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టపోయాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్లు నష్టపోయింది. అయితే చివర్లో మార్కెట్లు కొంత పుంజుకున్నాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 276 పాయింట్లు కోల్పోయి 54,088కి పడిపోయింది. నిఫ్టీ 72 పాయింట్లు నష్టపోయి 16,167 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ ( 1.92%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.37%), హెచ్డీఎఫ్సీ (1.35%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (0.73%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.50%). 

టాప్ లూజర్స్:
ఎల్ అండ్ టీ (-2.34%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.10%), బజాజ్ ఫైనాన్స్ (-2.08%), ఎన్టీపీసీ (-2.00%), ఇన్ఫోసిస్ (-1.70%).
Sensex
Nifty
Stock Market

More Telugu News