అడివి శేష్ 'మేజర్' ట్రైలర్ చూసిన రాజ్ నాథ్ సింగ్... చిత్రబృందానికి అభినందనలు
- ముంబయి ఉగ్రదాడుల్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వీరమరణం
- ఆయన జీవితకథతో మేజర్ చిత్రం
- మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గా అడివి శేష్
- మే 9న ట్రైలర్ రిలీజ్
- రాజ్ నాథ్ కు ముందే చూపించిన చిత్రబృందం
కాగా, ఈ సినిమా ట్రైలర్ ను చిత్రబృందం నేడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు చూపించింది. మేజర్ ట్రైలర్ ను వీక్షించిన రాజ్ నాథ్... చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమా విజయవంతం కావాలని అభిలషించారు. ఈ సందర్భంగా మేజర్ చిత్ర స్లోగన్ ను విడుదల చేశారు. వాస్తవానికి మేజర్ చిత్రం ట్రైలర్ ఈ నెల 9న రిలీజ్ కానుంది. అయితే, కేంద్రమంత్రి రాజ్ నాథ్ కు ట్రైలర్ ను ముందే చూపించారు. ఈ చిత్రం జూన్ 3న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.