గెలిచే వారికే టికెట్లు.. గెలవలేని వారు పక్కకే: జగన్ కీలక వ్యాఖ్యలు
- జూలై 8న పార్టీ ప్లీనరీ
- మే 10 నుంచి గడప గడపకు వైసీపీ
- ఏ ఒక్కరూ ప్రత్యేకం అని భావించరాదన్న జగన్
- ఎన్నికల్లో గెలిచేందుకు వనరులు సమకూరుస్తామని వెల్లడి
ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేనివారిని పక్కనపెట్టనున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఎవరికైనా పార్టీనే సుప్రీం అని చెప్పిన జగన్... గెలిచిన వారికే మంత్రి పదవులు దక్కుతాయని చెప్పారు. గెలిచేందుకు కావాల్సిన వనరులను సమకూరుస్తానని కూడా జగన్ చెప్పుకొచ్చారు. ఏ ఒక్కరు కూడా తాము ప్రత్యేకం అనుకోవడానికి వీల్లేదని కూడా జగన్ హెచ్చరించారు.