రాజస్థాన్ రాయల్స్ పై టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్... మరో విజయం కోసం ఆరాటం

Delhi Capitals won the toss against Rajasthan Royals
  • ఐపీఎల్ లో ఆసక్తికర పోరు
  • ముంబయి వాంఖెడే మైదానంలో మ్యాచ్
  • బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
  • ఢిల్లీ జట్టుపై పడని కరోనా ప్రభావం
కరోనా కలకలం రేగినా తమ స్థైర్యం దెబ్బతినలేదని గత మ్యాచ్ తో ఘనంగా చాటిన ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ తాజా సీజన్ లో మరో మ్యాచ్ కు సిద్ధమైంది. రిషబ్ పంత్ నాయకత్వంలోని ఢిల్లీ జట్టు నేడు రాజస్థాన్ రాయల్స్ తో తలపడుతోంది. టాస్ నెగ్గిన పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే మైదానం వేదికగా నిలుస్తోంది. రెండు జట్లలోనూ ఈ పోరు కోసం ఎలాంటి మార్పులు లేవు.

కాగా, ఇక్కడి పిచ్ స్పిన్నర్లకు కొద్దిగా సహకరిస్తుందని భావిస్తున్నారు. రాజస్థాన్ జట్టులో రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్... ఢిల్లీ జట్టులో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి స్టార్ స్పిన్నర్లు ఉండడంతో బంతికి, బ్యాట్ కు మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది. 

టోర్నీలో ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ 6 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు సాధించగా, ఢిల్లీ క్యాపిటల్స్ 6 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు నమోదు చేసింది. 

ఇటీవల ఢిల్లీ జట్టులో కరోనా కేసులు వెలుగుచూడడం తెలిసిందే. ఆటగాళ్లు మిచెల్ మార్ష్, సీఫెర్ట్ లతో పాటు ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్, జట్టు మసాజర్ కూడా కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న మార్ష్ ను ఆసుపత్రికి తరలించి మిగతా వారిని ఐసోలేషన్ లో ఉంచారు. ఇలాంటి నేపథ్యంలో, పంజాబ్ పై మ్యాచ్ లో ఢిల్లీ స్ఫూర్తిదాయక ఆటతీరు కనబర్చి 9 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.
Go Back to Shorts
Delhi Capitals
Toss
Rajasthan Royals
IPL
Corona

More Telugu News