ఏపీలో డైకిన్ రూ.1000 కోట్ల పెట్టుబ‌డి.. శ్రీసిటీలో ఏసీల త‌యారీ యూనిట్‌

daikin foundation stone its plant in sricity
  • ఏసీల త‌యారీలో అగ్ర‌గామిగా డైకిన్‌
  • శ్రీసిటీలో ఉత్ప‌త్తి ప్లాంట్ ఏర్పాటు
  • రూ.1,000 కోట్ల పెట్టుబ‌డితో ప్లాంట్‌
  • 3 వేల మందికి ఉపాధి ల‌భించ‌నుంద‌న్న సాయిరెడ్డి
ఎయిర్ కండిషనర్ల త‌యారీలో ప్ర‌ముఖ సంస్థ‌గా పేరొందిన డైకిన్ ఏపీలో త‌న ఉత్ప‌త్తి ప్లాంట్‌కు శంకుస్థాప‌న చేసింది. రూ.1,000 కోట్ట పెట్టుబ‌డితో ఆ సంస్థ చిత్తూరు జిల్లా శ్రీసిటీలో త‌న ప్లాంట్‌ను ఏర్పాటు చేయ‌నుంది. ఈ ప్లాంట్‌లో డైకిన్ సంస్థ ఏడాదికి 15 ల‌క్ష‌ల ఏసీల‌తో పాటు కంప్రెస‌ర్లు, కంట్రోల‌ర్ బోర్డులు, ఇత‌ర విడిభాగాల‌ను త‌యారు చేయ‌నుంది.

ఈ ప‌రిశ్ర‌మ ద్వారా 3 వేల మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌న్నాయి. ఈ మేర‌కు ఈ విష‌యాన్ని కాసేప‌టి క్రితం వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. శ్రీసిటీలో రూ.1,000 కోట్లతో భారీ ఏసీ తయారీ కేంద్రం ఏర్పాటుకు డైకిన్‌ సంస్థ శంకుస్థాపన చేసిందని ఆయ‌న తెలిపారు.
Go Back to Shorts
Daikin
Vijay Sai Reddy
Sricity

More Telugu News