వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకలు!.. ఐసీయూలో రోగిని కొరికేసిన వైనం!
- ఎంజీఎంలో రోగి కాలును కొరికేసిన ఎలుకలు
- ఘటనపై పలు టీవీ ఛానెళ్లలో కథనాలు
- తక్షణమే స్పందించిన మంత్రి హరీశ్ రావు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆసుపత్రిగా పేరుగాంచిన ఎంజీఎంలో ఎలుకలు సంచరిస్తున్నాయంటే.. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోందని ఆయన అధికారులను మందలించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.