ఫ్యాను గుర్తుకు ఓటేస్తే.. ఫ్యాన్లు తిరగని పరిస్థితి: జనసేన
- విద్యుత్ చార్జీల పెంపుతో వైసీపీ మోసం చేసింది
- విద్యుత్ చార్జీల పెంపుకు వ్యతిరేకం
- ప్రజల పక్షాన రోడ్డెక్కుతామని జనసేన హెచ్చరిక
వైసీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను భారీగా పెంచి ప్రజలను మోసం చేసిందని ఆ ప్రకటనలో జనసేన ఆరోపించింది. విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పిన జనసేన.. ప్రజలపై భారం మోపాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. బాధ్యత కలిగిన విపక్షంగా ప్రజల పక్షాన రోడ్డెక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం నాడు రాజమహేంద్రవరంలో జనసేన పీఏసీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ తన ప్రకటనలో పొందుపరచింది.