Andhra Pradesh: ఏపీలో అత్యంత కనిష్ఠ స్థాయికి కరోనా... తాజా వివరాలు ఇవిగో!

Corona new cases dropped significantly in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. గడచిన 24 గంటల్లో 8,219 కరోనా పరీక్షలు నిర్వహించగా, 5 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఇదే అత్యల్పం అనుకోవచ్చు! కృష్ణా జిల్లాలో 2 కేసులు వెల్లడి కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1, కడప జిల్లాలో 1 కేసు గుర్తించారు. మిగతా జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. 

అదే సమయంలో 37 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 23,19,509 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,465 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 314 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.
.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
New Cases
Daily Report
Today Cases

More Telugu News