ప్రాణాలు పోతున్నా స్పందించ‌రా?.. జ‌గ‌న్ స‌ర్కారుపై చంద్రబాబు ధ్వ‌జం

chandrababu fires on jagan government
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో ప‌దుల సంఖ్య‌లో జ‌నం ప్రాణాలు కోల్పోతున్నా స్పందించ‌రా? అంటూ టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు వైసీపీ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెంలో 15 మంది మృతి, క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో క‌లుషితాహారం తిని విద్యార్థుల‌కు అస్వ‌స్థత అంశాల‌ను ప్ర‌స్తావించిన చంద్రబాబు.. జ‌నం ప్రాణాలు కోల్పోతున్నా వైసీపీ స‌ర్కారులో చ‌ల‌నం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

జంగారెడ్డిగూడెం ప‌ట్ట‌ణంలో నాటు సారా కార‌ణంగా ఇటీవ‌లే 15 మంది చ‌నిపోయార‌ని చంద్ర‌బాబు గుర్తు చేశారు. ఈ మ‌ర‌ణాల‌న్నీ కేవ‌లం 3 రోజుల్లోనే సంభ‌వించాయ‌ని ఆయ‌న‌ తెలిపారు. నాటు సారా కార‌ణంగా వాంతులు, విరేచ‌నాల‌తో జంగారెడ్డిగూడెం వాసులు ఆసుప‌త్రుల్లో చేరి గంట‌ల వ్య‌వ‌ధిలోనే చ‌నిపోయార‌ని ఆయ‌న తెలిపారు. 

ఇక నంద్యాల‌లో క‌లుషితాహా‌రం తిన్న కార‌ణంగా 42 మంది విద్యార్థులు అస్వ‌స్థత‌కు గుర‌య్యార‌ని అన్నారు. నంద్యాల‌లోని విశ్వ‌న‌గ‌ర్ పాఠ‌శాల‌లో కుళ్లిన కోడి గుడ్లు పెట్టిన కార‌ణంగా విద్యార్థులు అనారోగ్యానికి గుర‌య్యార‌ని చంద్ర‌బాబు మండిపడ్డారు. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం స్పందించ‌లేదని ఆరోపించిన చంద్ర‌బాబు..అస‌లు రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఉందా? అని ప్ర‌శ్నించారు.
Go Back to Shorts
TDP
Chandrababu
Andhra Pradesh
Jangareddifudem
Nandyal

More Telugu News