బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్.. బొల్లారం పీఎస్కు తరలింపు
- గవర్నర్ ప్రసంగం లేని వైనంపై బీజేపీ సభ్యుల నిరసన
- ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్
- అసెంబ్లీ ముందు బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
- అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్కు తరలించిన పోలీసులు
అయితే, తమను సస్పెండ్ చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు కేసీఆర్ సర్కారు తీరును నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలను బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు.