ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధంపై మోదీ సమీక్ష
- యుద్ధ పరిణామాలపై చర్చలు
- పాల్గొన్న కేంద్రమంత్రులు, అజిత్ దోవల్
- భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగింపు
ఆపరేషన్ గంగలో భాగంగా ఇంకా చాలా మందిని ఉక్రెయిన్ నుంచి తీసుకురావాల్సి ఉంది. ఆ దేశ సరిహద్దు దేశాలకు ఇప్పటికే నలుగురు కేంద్ర మంత్రులు వెళ్లారు. కొందరు భారతీయులను ఉక్రెయిన్లో సైనికులు బందీలుగా చేసుకున్నారని కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అందులో నిజం లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఆయా అంశాలన్నింటిపైనా మోదీ చర్చించినట్లు తెలుస్తోంది.